
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి కొండా సురేఖ మధ్య చిచ్చు మరింత రాజుకుంటుంది. ఫోన్ ట్యాపింగ్, నాగార్జున కుటుంబ విషయంపై కొండా సురేఖ అసత్య ఆరోపణలు చేశారంటూ కేటీఆర్ మండిపడ్డారు.
ఫోన్ ట్యాపింగ్ నాగచైతన్య, సమంతలపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలను అక్కినేని నాగార్జున, అమల, నాగచైతన్య, సమంత సహా పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. సురేఖపై చర్యలు తీసుకోవాలంటూ రాహుల్ గాంధీకి అమల ఫిర్యాదు చేశారు. మరోవైపు కేటీఆర్ కూడా కొండా సురేఖ మాటలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో లీగల్ నోటీసును పంపించారు. కేవలం రాజకీయ కక్షతోనే, రాజకీయాల ప్రయోజనం కోసమే తన పేరును వాడుకుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఒక మహిళ అయి ఉండి ఇంకో మహిళ పేరును, సినిమా పేరును వాడుకొన వారి వ్యక్తిక్త హనానికి పాల్పడటం దురదృష్టకరమన్నారు. అసలు తనకు సంబంధమే లేని అంశాలపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అసత్యమైవంటూలీగల్ నోటీసులో పేర్కొన్నారు.
కేటీఆర్ మంత్రిగా పనిచేస్తున్న కాలంలో ఫోన్ టాపింగ్ చేశారంటూ సురేఖ చేసిన వ్యాఖ్యలతో పాటు, నాగచైతన్య సమంత విడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆర్ అంటూ కొన్ని దుర్వేశపూర్వక వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ. దీంతో కేవలం తన గౌరవానికి భంగం కలిగించాలన్న ఉద్దేశ్యంతోనే కొండ సురేఖ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని లీగల్ నోటీసులో కేటీఆర్ పేర్కొన్నారు. ఒక మంత్రిగా కొండా సురేఖ తన మంత్రి హోదాను దుర్వినియోగం చేశారన్నారు. ఎలాంటి సాక్షాలు లేకుండా కొండా సురేఖ చేసిన అసత్య పూరిత వ్యాఖ్యలు, దురుద్దేశ పూరిత మాటలు మీడియా, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచురితం అయ్యాయన్నారు.