
ఏపీ ప్రజలకు సర్కార్ శుభవార్తనందించింది. సంక్రాంతి నుంచి మరో కార్యక్రమం అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. పేదరికంలేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా P-4 కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. సూపర్ సిక్స్ అమల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు. సంక్రాంతి నుంచి P4 ప్రొగ్రామ్ అమల్లోకి రాబోతుందని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి శ్రీకారం చుట్టనున్నట్టుగా ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి నుంచి పీ4 కార్యక్రమం అమలు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
బందర్లో పర్యటించిన సీఎం చంద్రబాబు 2047 కల్లా భారత్ ప్రపంచంలోనే సూపర్ పవర్గా మారబోతుందన్నారు. ప్రగతిపథంలో దూసుకెళ్లాలంటే హార్డ్ వర్క్ తో పాటు స్మార్ట్ వర్క్ చేయాలన్నారు. టెక్నాలజీని , ఇంటెలిజెన్సీ ని వాడుకుంటూ ముందుకు సాగాలన్నారు. అభివృద్ది అంశాలతో పాటు కుటుంబనియంత్రణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీఎం స్వర్ణాంధ్ర లక్ష్యంగా త్వరలో P4 కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. P4 అంటే ..పబ్లిక్..ప్రైవేట్ ..పీపుల్..పార్టనర్షిప్…పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. సంక్రాంతి నుంచి అమల్లోకి రానున్న P4 కార్యక్రమాన్ని నిమ్మకూరులో పైలట్ ప్రాజెక్ట్గా చేపట్టనున్నారు.
ఇక డ్వాక్రా సంఘాలకు MSME హోదా కల్పించడం సహా , స్వచ్చసేవకుల అభివృద్ధికి అన్ని విధాల చేయూతనిస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. జనవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు కాబోతున్న P4 కార్యక్రమం ఎలా వుండబోతుంది. విధివిధానాలు ఎలా వుంటాయనే చర్చ జరుగుతోందిప్పుడు.