మార్కెట్ లోకి డైకిన్‌ జపాన్‌ హోమ్ ఎసీలు

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పతుల తయారి సంస్థ డైకిన్‌ జపాన్‌ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఆధునిక ఏసీలను తమ వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన విఆర్‌ఎ హోమ్‌ ఎసీలను ఆ సంస్థ ఇండియా డైరెక్టర్‌ సంజయ్‌ గోయల్‌ హైదరాబాద్‌ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో రాష్ట్ర విఫణిలోకి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సంజయ్‌ గోయల్‌తోపాటు ఆంధ్ర, తెలంగాణ సౌత్‌ డిప్యూటి జనరల్‌ మేనేజర్‌ గణేష్‌రావు, మార్కెట్‌ మేనేజర్‌ జగదీష్‌, సంస్థ ప్రతినిధి లక్ష్మాణ్‌ తదితరులు పాల్గొన్ని నూతన ఉత్పత్పలను ఆవిష్కరించారు. మారుతన్న పరిస్థితులు, సాంకేతిక సదుపాయాలను, గృహావసరాలను దృష్టిలో పెట్టుకుని ఆధునాతన ఎసీలను వినియోగదారులకు అందిస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్‌ సంజయ్‌ గోయల్‌ తెలిపారు.

మేక్‌ ఇండియాలో భాగంగా జపాన్‌ ఆత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విఆర్‌ఎ హోమ్‌ ఎసీలను రూపొందించామన్నారు. కోవిడ్‌ కారణంగా ప్రజలు ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారని….దీనికి తగిన విధంగా విఆర్‌ఎ హోమ్‌ ఎసీలను తయారు చేసినట్లు తెలిపారు. దేశంలో ఎయిర్‌ కండిషన్ల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో ఎగుమతులను పెంచాలనే ఉద్ధేశంతో ఆంధ్రప్రదేశ్‌లో వెయ్యి కోట్లతో ఏర్పాటు చేస్తున్న డైకిన్‌ ఎసిల తయారీ ఫ్యాక్టరీ వచ్చే ఏడాదికి అందుబాటులోకి వస్తుందన్నారు. విశాఖలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం వలన స్థానికి ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు అంతర్జాతీయంగా ఉత్పత్తులను ఎగుమతులు చేసేందుకు సులవు అవుతుందన్నారు. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరానికి 6 కోట్ల వ్యాపారం లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఆయన చెప్పారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో 22 శాతం మార్కెట్‌ షేర్‌ కలిగియున్నామని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సహం కారణంగానే ఇది సాధ్యమైందన్నారు.

బైట్: సంజయ్‌ గోయల్‌, డైకిన్‌ ఇండియా డైరెక్టర్‌
బైట్: గణేష్‌రావు, ఆంధ్ర, తెలంగాణ సౌత్‌ డిప్యూటి జనరల్‌ మేనేజర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *